రవి తేజ సినిమాలు ఈ మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఎందుకంటే మాస్ మహరాజ సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సన్నీవేశాలతో రూపొందుతున్న సంగతి అందరికి తెలుసు.. గతంలో ఎన్నో సినిమాలు భారీ యాక్షన్ తో వచ్చినా కూడా బాక్సాఫిస్ వద్ద ఎక్కువ రోజులు ఉండలేక పోయాయి. మొన్నీమధ్య క్రాక్ సినిమా తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవి తేజ.. ఆ సినిమా తర్వాత ఖిలాడీ సినిమా తో ప్రెక్షకులను పలకరించాడు.. కానీ ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. హిట్ సినిమా లతో పని లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో మూడు సినిమాలలో నటిస్తున్నారు.



ఇప్పుడు మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లారు..టైగర్ నాగేశ్వరరావు' సినిమా లాంఛనంగా ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే..అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే కాన్సెప్టుతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ సినిమాని అనౌన్స్ చేసి, ఆఖరి నిమిషంలో తప్పుకున్న సంగతి అందరికి తెలుసు.ఈ సినిమా ఓపెనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే..



భారీ యాక్షన్ తో భారీ బడ్జెట్ తో సోలో నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. దాంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడాలని సినిమా ఓపెనింగ్ కు భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యెకమైన సెట్ తో పాటు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు.మొత్తంగా 45 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ప్రొడ్యూసర్ చాలా పెద్ద రిస్క్ చేసేసినట్లే అని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట వినిపిస్తుంది. ప్రారంభోత్సవానికే ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే, సినిమా నిర్మాణానికి ఇంకే స్థాయిలో ఖర్చు చేయనున్నారో అని అందరూ ఆలోచనలో పడ్డారు. మరి ఈ సినిమా ఏ రెంజులొ వుంటుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందె..

మరింత సమాచారం తెలుసుకోండి: