టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన దగ్గుబాటి రానా తాజాగా విరాట పర్వం మూవీ లో హీరో గా నటించిన ఈ విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో రానా ...  రవన్న అనే నక్సలైట్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

మూవీ లో  సాయి పల్లవి ... వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ మూవీ లో ప్రియ మణి మరో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి నీది నాది ఒకే కథ మూవీ తో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వేణు ఉడుగుల కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా జూన్ 17 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. విడుదలైన మొదటి షో నుండే ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే విరాట పర్వం చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాకు డిజిటల్ పార్ట్నర్ ను  ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ  పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నేట్ ఫ్లిక్స్ మంచి ఫ్యాన్స్ రేట్ కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే థియేటర్ లలో విడుదల అయిన విరాట పర్వం సినిమా  ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బెబ్బులి సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: