వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా సంచలన విజయం అందుకోవడంతో హీరో కి టాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. మొదటి సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడంతో ఆ తర్వాత ఎన్నో సంచలన సినిమాలు చేస్తానని చెప్పారు కానీ ఆయన నటించిన రెండో సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడం ఒక్క సారిగా ఆయన పై ఉన్న అంచనాలని తొలగిపోయాయి. క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం సినిమా భారీ పరాజయాన్ని అందుకోగా ఇప్పుడు తన మూడవ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

అందుకే మూడో సినిమాగా రంగ రంగ వైభవంగా అనే ఓ సినిమాను చేస్తు న్నాడు. గిరీషాయ దర్శకత్వం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. జూలైలో ఈ సినిమాను విడుదల చేయబోతుంది. సోలో గా విడుదల అవుతూ ఉండడం కూడా ఈ సినిమా మంచి విజయం తో పాటు మంచి కలెక్షన్లను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది.

అయితే ఆ సమయంలో మరిన్ని క్రేజీ సినిమాలు విడుదల అవుతూ ఉండ డం వైష్ణవ్ తేజ్ ను ఆయన అభిమానులను అందరినీ ఎంతగానో టెన్షన్ పెట్టిస్తుంది. మరి తనకు తప్పకుండా విజయం అవ్వాల్సిన ఈ సమయంలో ఈ చిత్రం ఏ విధంగా ఆయన కు హిట్ ను తెచ్చి పెడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరిచాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూ రుస్తున్నడం విశేషం. ఇతర కుర్ర హీరోలు సినిమాల పట్ల దూసుకు పోతుంటే ఈ హీరో ఎలా ఈ సినిమా ను హిట్ చేసుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: