రక్షకుడు సినిమా ద్వారా నాగార్జున సరసన నటించిన సందడి చేసిన ముద్దుగుమ్మ సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తో నటించిన ఒకే ఒక్కడు సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక 1994లో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అంతేకాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో 40 సంవత్సరాల వయసు దాటినా కూడా పెళ్లి పీటలు ఎక్కని ఎంతో మంది ముద్దుగుమ్మలో సుస్మితాసేన్ కూడా ఒకరు. కానీ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన మంచి మనసును చాటుకుంది.

2015 తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించని ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలతో మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తాను ప్రేమించిన వ్యక్తితో రిలేషన్షిప్ , బ్రేకప్ వార్తలతో బాగా పాపులర్ అవుతోంది.ఇక  ప్రస్తుతం ఏడు అడుగులు వేయకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్  ఖన్నా హోస్టుగా చేస్తున్న ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్  కార్యక్రమానికి పాల్గొన్న సుస్మితాసేన్ వివాహ బంధానికి ఎందుకు దూరంగా ఉందో తెలిపింది.

సుస్మిత సేన్ మాట్లాడుతూ.. జీవితంలో చాలా మంది వ్యక్తులను కలుసుకున్నాను.. కానీ ఎప్పుడూ కూడా పెళ్లి గురించి ఆలోచించలేదు ..దీనికి కారణం నా దగ్గర ఉన్న పిల్లలు అని ఏ మాత్రం అనుకోలేదు. ముఖ్యంగా నా పిల్లలతో నాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముక్తకంఠంతోనే అంగీకరించాను నేను.. ఇక ప్రతి ఒక్కరికి కూడా సమానమైన గౌరవాన్ని.. ప్రేమను కూడా అందించాను.. నిజానికి మూడుసార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లిన నన్ను అదృష్టవశాత్తు ఆ దేవుడు నన్ను రక్షించాడు అంటూ ఆమె తెలిపింది. కానీ దేవుడు నన్ను మా పిల్లలను కాపాడుతున్నాడు అంటూ.. గజిబిజి బంధంలో చిక్కుకుపోవాలని దేవుడు కోరుకోవడం లేదు అంటూ సుస్మిత తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: