టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గిరిశయ్య  దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి ట్రైలర్ ని విడుదల చేసింది. 

మూవీ ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ని కూడా మూవీ యూనిట్ లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 23 నిమిషాల సాధారణ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా కొండ పొలం మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగా వైభవంగా' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: