తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లు అయినటు వంటి పోకిరి , అతడు మూవీ లను 4 కే వర్షన్ లో విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

అలాగే ఈ మూవీ లను 4 కే వర్షన్ లో రీ రిలీజ్ చేసినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే సంవత్సరం పుట్టిన రోజు సందర్భంగా మరో మహేష్ బాబు నటించిన మూవీ ని 4 కే వర్షన్ లో  రీ రిలీజ్ చేయడానికి ఇప్పటి నుండే మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో మన అందరికీ తెలిసిందే. అతడు మూవీ లో సోను సూద్ ప్రతి నాయకుడి ,  పాత్ర లో నటించగా నాజర్ , ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇలా ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన అతడు మూవీ ని వచ్చే సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4 కే వర్షన్ లో రీ రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అతడు మూవీ 4 కే వర్షన్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: