ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతోంది అంటు వరుస కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి దీంతో మొదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ ఉంటుందని అభిమానులు కూడా అనుకున్నారు. దీనికి బాలీవుడ్ మీడియా కూడా కాస్త ప్రాణం పోసినట్టుగా ప్రచారం చేసింది. పార్ట్ 2 లో కొత్త స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తే ఈ సినిమా మరింత క్రేజీ పెరిగే అవకాశం ఉంటుందని కథలుగా వినిపించాయి అయితే వీటన్నిటికీ తాజాగా చిత్ర బృందం పులిస్టాప్ పెట్టడం జరిగింది. పుష్ప పార్ట్ -2 లో ప్రస్తుతానికి ఎలాంటి అడిషనల్ క్యారెక్టర్స్ లేవు ప్రత్యేకించి లీడింగ్ లేడీ విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.
ముఖ్యంగా ఇందులో ట్రైబల్ యువత పాత్ర అసలు లేదు అంతేకాకుండా మేము ఈ పాత్ర కోసం సాయి పల్లవి అసలు సంప్రదించలేదంటూ పుష్ప -2 పై వస్తున్న రూమర్లకు చెప్పే ప్రయత్నం చేసింది చిత్రం బృందం. పుష్పరాజు శ్రీవల్లి పెళ్లితో మొదటి భాగం ఎండ్ అవుతుంది.. అక్కడ నుంచి పార్ట్ -2 మొదలవుతుంది. అలా పార్ట్-1 లో ఫహద్ ఫాజిల్, బన్వర్ సింగ్ షెకావత్, అనసూయ ,సునీల్ తదితరులు నటిస్తున్నారని తెలిపారు.