అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ది రైజ్.. ఈ సినిమా అత్యధిక భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రంగా నిలిచింది . ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా అనూహ్యంగా స్పందన లభించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పార్ట్ 2 పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. బడ్జెట్ను మించి మేకర్స్ భారీ స్థాయిలో బడ్జెట్ ని పెంచేశారు. ఇక మొదటి భాగం ఎంతటి కలెక్షన్లనే సాధించిందో పార్ట్-2 సరిగ్గా అంతే బడ్జెట్ తో రూ.350 కోట్ల రూపాయలతో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది అందుకు సంబంధించి ఇదివరకే లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు సమాచారం.



ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతోంది అంటు వరుస కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి దీంతో మొదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ ఉంటుందని అభిమానులు కూడా అనుకున్నారు. దీనికి బాలీవుడ్ మీడియా కూడా కాస్త ప్రాణం పోసినట్టుగా ప్రచారం చేసింది. పార్ట్ 2 లో కొత్త స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తే ఈ సినిమా మరింత క్రేజీ పెరిగే అవకాశం ఉంటుందని కథలుగా వినిపించాయి అయితే వీటన్నిటికీ తాజాగా చిత్ర బృందం పులిస్టాప్ పెట్టడం జరిగింది. పుష్ప  పార్ట్ -2 లో ప్రస్తుతానికి ఎలాంటి అడిషనల్ క్యారెక్టర్స్ లేవు ప్రత్యేకించి లీడింగ్ లేడీ విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.


ముఖ్యంగా ఇందులో ట్రైబల్ యువత పాత్ర అసలు లేదు అంతేకాకుండా మేము ఈ పాత్ర కోసం సాయి పల్లవి అసలు సంప్రదించలేదంటూ పుష్ప -2 పై వస్తున్న రూమర్లకు చెప్పే ప్రయత్నం చేసింది చిత్రం బృందం. పుష్పరాజు శ్రీవల్లి పెళ్లితో మొదటి భాగం ఎండ్ అవుతుంది.. అక్కడ నుంచి పార్ట్ -2 మొదలవుతుంది. అలా పార్ట్-1 లో ఫహద్ ఫాజిల్, బన్వర్ సింగ్ షెకావత్, అనసూయ ,సునీల్ తదితరులు నటిస్తున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: