నందమూరి నటసింహం బాలయ్య ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు ఓటీటీలో హోస్ట్‌గానూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.అన్‌స్టాపబుల్' అనే టాక్ షోతో బాలయ్య హోస్ట్‌గా అవతారమెత్తారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో, రెండో సీజన్‌ని ఇటీవలే తెర లేపారు బాలయ్య అండ్ అన్‌స్టాపబుల్ టీమ్.

ఈ నేపథ్యం లో మొదటి గెస్ట్‌గా ఈ షోకి నారా చంద్ర బాబు నాయుడుని తీసుకొచ్చి, షోకి హైప్ క్రియే ట్ చేశారు. హైప్‌కి తగ్గట్లు గానే ఈ ఎపిసో డ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వా త విశ్వక్‌సేన్, సిద్దు జోన్నల గడ్డతో నవ్వులు పూయిం చారు బాలయ్య.

ఇక మూడో ఎపి సోడ్ కోసం సీనియర్ నటి రమ్య కృష్ణ, అందాల భామ రాశీఖ న్నాతో షోకి సరికొత్త గ్లామర్ అద్దబో తున్నారట హోస్ట్‌గా బాలయ్య.

రోజాతో బాలయ్య అన్‌స్టాప బుల్ 2.! సాధ్యమేనా.!

ఈ క్రమం లోనే నాలుగో ఎపిసోడ్ ఆసక్తిని క్రి యేట్ చేస్తోంది. నాలుగో ఎపిసోడ్ కోసం వైఎస్సా ర్‌సీపీ మంత్రి రోజాని గెస్ట్‌గా తీసుకు రానున్నారనీ తెలుస్తోంది.ఇప్పటికే రోజాతో బాలయ్య సంప్రదిం పులు చేశారనీ తెర వెనక సమాచారం. తెలుగు దేశం పార్టీకీ, వైఎస్సార్‌సీపీ పార్టీకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమం టుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్యను అనేక సందర్భాల్లో మంత్రి రోజా పలు దుర్బాషలు ఆడుతూ విమర్శలు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి ఒకే స్టే జ్‌పై అదీ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికపై..! అంటే ప్రేక్షకుల్లో డిఫరెంట్ క్యూరియాసిటీ నెలకొంది. అసలు ఇది సాధ్యమేనా.? అని అనుకుంటున్నారు. అయితే, రాజకీయం వేరు, ఇలాంటి టాక్ షోలు వేరు. వేటి దారి వాటిదే. జనం అనుకునేంత హంగామా ఏమీ ఆయా వ్యక్తుల మధ్య వుండదు. సో, ఆ యాంగిల్‌లో రోజా ఈ షోకి రావచ్చు. వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ నిజంగా ఆసక్తి కరమే సుమీ.!

మరింత సమాచారం తెలుసుకోండి: