టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం లైగర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కింది. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ లో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. పూరి కనక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లైగర్ మూవీ ని పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , హిందీ ,  మలయాళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలను విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో నష్టాలను కూడా చవి చూసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా లైగర్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... లైగర్ మూవీ లో మొదట "కే జి ఎఫ్" మూవీ లో హీరోగా నటించిన యాష్ హీరో గా నటించాల్సి ఉందట,  కాకపోతే లైగర్ మూవీ కథ నచ్చకపోవడంతో యాష్ ఈ మూవీ కి నో చెప్పాడట , ఆ తర్వాత ఈ మూవీ లో విజయ్ దేవరకొండ ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారని ఒక వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: