కేజీయఫ్ చిత్రాలతో
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన దర్శకుడు
ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా భారీ స్థాయి లో క్రేజ్ ను అందుకున్నాడు. అంతకు ముందు ఆయన కొన్ని సినిమాలు చేసినా ఈ
సినిమా ఆయనకు ఎక్కడ లేని గుర్తింపు తీసుకొచ్చింది. అలా స్టార్
డైరెక్టర్ గా మారిన తర్వాత ఈ దర్శకుడు మరో పాన్
ఇండియా హీరో
రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో
ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో
ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్లను మరో లెవెల్లో చిత్రీకరిస్తున్నాడట. యాక్షన్ సినిమాలను ఇంత బాగా చేస్తాడు కాబట్టే ఈ దర్శకుడు తో
సినిమా చేయడానికి చాలా మంది హీరోలు సిద్ధమయ్యారు. ఆ విధంగా ఇప్పుడు ఆయన తదుపరి
సినిమా ఎవరితో చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పాలి. నిన్న మొన్నటిదాకా ఆయన తదుపరి సినిమాను
ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో
ఎన్టీఆర్ సినిమానే దాదాపుగా ఖాయం అవుతుంది అని భావించారు.
తాజాగా
రామ్ చరణ్ కూడా సలార్ చిత్రం పూర్తయిన తర్వాత తనతోనే
సినిమా చేయాలని రిక్వెస్ట్
ప్రశాంత్ నీల్ కు చేరవేశాడట. గతంలోనే
కేజిఎఫ్ సినిమా భారీ విజయం అందుకున్న సమయం లోనే
మెగాస్టార్ చిరంజీవి మరియు
రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఈ దర్శకుడునీ మీట్ అయ్యారు. అప్పుడు చరణ్ తో ఒక
సినిమా చేస్తాను అనీ
ప్రశాంత్ నీల్ మాట ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు చేస్తానో అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి చరణ్
ప్రశాంత్ పై కాస్త ఒత్తిడి తీసుకు వస్తున్నాడట చరణ్ ప్రస్తుతం ఆయన
శంకర్ దర్శకత్వంలోని
సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది దాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాదిలో
ప్రశాంత్ సినిమాను చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.