టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హీరోలు ఫ్యాన్ ఇండియా సినిమాలు చేయడంతో దేశవ్యాప్తంగా వారికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ నేపథ్యంలో మన హీరోలు కొంతమంది బాలీవుడ్ లో సైతం సినిమాలో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది. బాలీవుడ్ హీరోలు అందరూ కూడా అక్కడి సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం ఒప్పించకపోవడంతోనే ఇతర భాషల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ విధంగా ఇక్కడి హీరోలు ఆ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం నిజంగా విడ్డూరం అనే చెప్పాలి

ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాను బాలీవుడ్లో చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని కూడా బాలీవు డ్లో చేస్తున్నాడు వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది హీరోలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి చిత్ర పరిశ్రమను గాడిలో పెట్టాలంటే మన హీరోలు అక్కడ సినిమాలే చేయవలసింది అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతుంది. మరి పాన్ ఇండియా చిత్రాలలో అగ్ర హీరోలుగా ఎదుగుతున్న వారు అక్కడి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం దేనికి దారితీస్తుందో చూడాలి.

వీరిద్దరూ మాత్రమే కాదు రామ్ చరణ్ కూడా ఇద్దరు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట అక్కడి ప్రొడక్షన్ బ్యానర్ లో పైన ఈ సినిమాలో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ సినిమా తరువాత ఆయన సంజయ్ భన్సాలీ నిర్మాణంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. బాలీవుడ్ లో ఇంతటి భారీ దర్శకుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయనతో సినిమా ఓకే అయితే కనుక తప్పకుండా ఎన్టీఆర్ కు ప్లస్ అవుతుందని చెప్పాలి. చారిత్రాత్మక సినిమాలను చేసే సంజయ్ లీల భన్సాలీ ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: