నటసింహం నందమూరి బాలకృష్ణ కొంత కాలం గా ప్లాప్ సినిమలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.అనంతరం ఆఖండ` సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే.కాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.అయితే  ప్రస్తుతం బాలకృష్ణ `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఇందులో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది.అంతేకాదు  అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. 

విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే  వచ్చే ఏడాది సంక్రాంతి కానుక భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది.అయితే ఈ నేపథ్యంలోనే మెల్లమెల్లగా ప్రచార కార్యక్రమాలను సైతం షురూ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు బాలయ్య అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

 ఇక బాలయ్య ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు అన్న టాక్ ఉంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం బాలయ్య తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారట. ఇందులో భాగంగానే `వీర సింహారెడ్డి `కి ఆయన రూ. 15 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ప్రచారమే నిజమైతే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్య సైతం ఒకరవుతారు., `వీర సింహారెడ్డి` అనంతరం బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇక  `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి నిర్మించనున్నారు. అయితే ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించబోతోంది. ఇక వీర సింహారెడ్డి విడుదల అనంతరం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: