మన తెలుగు రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలుగు హీరోల పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే హీరోలు మాత్రం స్పందించడం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కూడా తెలుగు హీరోలపై ఇప్పుడు ఎక్కువగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే మన తెలుగు హీరోలు స్పందించక పోవడంపై అటు ఫాన్స్ లో కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదలు తీవ్రస్థాయిలో బీభత్సం సృష్టిస్తున్న సరే చాలా మంది హీరోలు అసలు కనీసం ప్రజల్లోకి రావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తమిళనాడు అదేవిధంగా మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు వస్తే స్టార్ హీరోలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా సినీ ప్రముఖులు ప్రజల్లోకి వచ్చి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా ప్రజల్లోకి వెళ్లే సేవ చేశారు.

కానీ మన తెలుగు హీరోలు మాత్రం ఇప్పుడు హైదరాబాదులో బయటకు వచ్చే సాహసం చేయటం లేదు. ఇళ్ళకు మాత్రమే పరిమితం కావడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా విరాళాలు ప్రకటించే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఒక బాలకృష్ణ మినహా ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించి విరాళం ప్రకటించిన పరిస్థితి లేదు. కనీసం ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలను తెలుసుకుని వారికి ఆహారం అందించే ఏర్పాట్లు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు చేయలేకపోతున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో అయినా సరే స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: