బిగ్ బాస్ సీజన్ 4లో ఎప్పుడూ సీరియస్ గా ఉండే సోహేల్ నాగార్జున వార్నింగ్ తో ఒక్కసారిగా కూల్ గా మారాడు. కుక్కలా అరవడం మానుకో అని డైరెక్ట్ గా నాగార్జున అనడంతో మారాల్సిన అవసరం ఉందని చెప్పి శాంతంగా మారిపోయాడు సోహెల్. అయితే సోహెల్ అలా మారకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అందరికి తెలిసిందే. ప్రతి టాస్క్ లో సోహెల్ రెచ్చిపోవడం.. హౌజ్ మేట్స్ తో ఏదో ఒక గొడవ జరుగుతుంది. అయితే సోహెల్ అలా తనని మార్చుకునే క్రమంలో ఆట మీద పట్టి కోల్పోయాడని ఆడియెన్స్ టాక్.

మునుపటి సోహెల్ ఆట బాగా ఆడాడని నాగార్జున అతని కోపాన్ని మాత్రమే తగ్గించమని అన్నారు తప్ప అతని ఆటని తగ్గించమని కాదని బయట టాక్. అఫ్కోఅర్స్ వాస్తవం కూడా అదే.. నాగార్జున సోహెల్ కోపాన్ని మాత్రమే తగ్గించుకో.. ఏదైనా ఉంటే హౌజ్ మేట్స్ తో గొడవలా కాకుండా విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పు అని అన్నారు కాని సోహెల్ మాత్రం తన కోపాన్ని పూర్తిగా జయించాలని ప్రయత్నిస్తున్నాడు. దాదాపు రెండు వారాల నుండి సోహెల్ గొడవలకు దూరంగా ఉన్నాడు.

అయితే అది తన ఆట మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు. హౌజ్ లో అభిజిత్, అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా ఉండగా మెహబూబ్ కూడా టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఓ పక్క లాస్య ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో సేవ్ అవుతూ వస్తుంది. అరియానా గ్లోరీ తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఎటొచ్చి స్టాంగ్ అనుకున్న సోహెల్ మాత్రమే రిస్క్ లో పడే అవకాశం ఉంది. మరి మెహబూబ్, అఖిల్ లతో స్నేహం అతన్ని ఎలిమినేట్ అయ్యేలా చేయకుండా సోహెల్ ఇదివరకులా ఆటని ఫోకస్ తో ఆడితే బెటర్ అని అతని ఫ్యాన్స్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: