మెగా మేనల్లుడు ఉప్పనలా వస్తున్నాడు. తొలి బ్లాక్ బస్టర్ తో టాప్ లెవెల్ లో ప్లేస్ సంపాదించడానికి దూసుకువస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు కుమారుడు, హీరో సాయి తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఉప్పెనలా థియేటర్లను తాకడానికి సిధ్ధంగా  ఉంది.

నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రావాల్సింది. రిలీజ్ కి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న మీదట వారంలో థియేటర్లలో బొమ్మ పడుతుంది అన్న టైం లో సడెన్ గా కరోనా వైరస్ దేశం మీదకు రావడంతో లాక్ డౌన్ ని ప్రకటించారు. దాంతో సినిమా ఆగిపోయింది. అలాగే ల్యాబ్ లలో మగ్గిపోయింది.

ఈ లోగా రిలీజ్ అయినా ఆడియో మాత్రం అదరగొట్టింది. ఉప్పెన సినిమా కంటే ముందే పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ మాంత్రికుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేసిన మ్యూజిక్ తో ఉప్పెన‌ సూపర్ హిట్ అన్న అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి.

ఇక ఓటీటీకి ఈ సినిమాకు ఇస్తారని ఒక దశలో వినిపించినా నో చెప్పి మరీ థియేటర్లలోనే రిలీజ్ కి ప్రాధ్యాన్యత ఇచ్చారు. మొత్తానికి ఫిబ్రవరి 5న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. కన్నడ భామ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. డెబ్యూ మూవీతోనే ఆ అమ్మడు వరస ఆఫర్లు పట్టేస్తోంది. వైష్ణవ్ తేజ్ కూడా క్రిష్ తో రెండవ సినిమా చేసి రేడీ ఫర్ రిలీజ్ అంటున్నాడు. ఇక ఉప్పెన సినిమా టీజర్ ని రేపు సంక్రాంతి సందర్భంగా  రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. మొత్తం మీద చూసుకుంటే మెగా మేనల్లుడి ఉప్పెన‌  మీద అంచనాలు అదిరిపోయే రేంజిలో ఉన్నాయి.ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: