బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి శిల్పాశెట్టిపై పడింది. నెక్స్ట్ ఆమెను కూడా అరెస్టు చేస్తారా? అనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. న్యూడ్ ఆడిషన్ చేయాలని రాజ్ కుంద్రా ఇతర హీరోయిన్లు అడిగే విషయాలు శిల్పకు తెలియదా? ఆమె ప్రమేయం ఇందులోనూ ఉందా? అనే విషయాలపై బీ టౌన్‌లో చర్చ సాగుతోంది.



రాజ్‌కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయన భార్య శిల్ప అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గాసిప్స్ వచ్చాయి. కొందరు అయితే శిల్ప ఏకంగా దేశం విడిచి వెళ్లిపోయిందనే ఊహాగానాలు చేశారు. కాగా, వీటన్నిటకీ చెక్ పెడ్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శిల్ప. భావోద్వేగంతో ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘లుకింగ్ ఎరౌండ్’ అనే టైటిల్ తో ఉన్న పుస్తకంలోని పేజీని స్క్రీన్ షాట్ తీసి పోస్టు పెట్టింది. భయంతో భవిష్యత్ చూసుకోవద్దని, చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని శిల్ప పేర్కొంది.


ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా ఉండాలనే సందేశాన్ని శిల్ప ఇచ్చింది. ఇదిలా ఉండగా శిల్ప నటించిన ‘హంగామా 2’ తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లోనూ ఆమె పాల్గొంది. తన పర్సనల్ విషయాలను పక్కనబెట్టి సినిమా చూడాలని సినీ లవర్స్, ప్రేక్షకులను కోరింది. ఇక గతంలో ఓ షోలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఒకతను మీ భర్త ఏం వ్యాపారం చేస్తాడని శిల్పను ప్రశ్నించగా, దానికి బదులివ్వకుండా నవ్వి ఊరుకుంటుంది శిల్ప. ఆ వీడియోను ప్రస్తుతం వైరల్ చేస్తున్నాడు. శిల్పాశెట్టి కూడా భర్త వ్యవహారాలతో కలిసి ఉంటుందని తెలిపే నెగెటివ్ ట్రోలింగ్ కూడా కొందరు చేస్తున్నారు. తన భర్త అశ్లీల వ్యాపారాల గురించి శిల్పకు తెలుసని అంటున్నారు. శిల్పా కూడా కటకటాల్లోకి వెళ్తుందనేది నెగెటివ్ ప్రచారమేనని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ పోలీసుల వద్ద లేవని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: