టాలీవుడ్ లో వరుణ్ తేజ్ కి జోడిగా కంచె సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్.. మొదటి సినిమాతోనే చక్కటి నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. హీరోయిన్ గా సరైన హిట్ అందుకోలేదు.ఇక ఒకటి రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది ఈ భామ. అయితే ప్రస్తుతం మాత్రం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో జోడీ కట్టింది ప్రగ్యా జైస్వాల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రగ్యా.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

దీని అనంతరం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.ఇక తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.బాలయ్య, ప్రగ్యా లతో పాటూ మరికొందరు కీలక నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా అఖండ సినిమా గురించి పలు కీలక విషయాలను వెల్లడించింది ప్రగ్యా జైస్వాల్.తాను అఖండ షూటింగ్ లో పాల్గొనకనుందు బాలయ్య చాలా సీరియస్ గా ఉంటారని..ఓ సీన్ కోసం ఎక్కువ టేక్ లు తీసుకుంటే విసుక్కుంటారని కొందరు తనకు చెప్పడంతో బాలయ్య తో షూటింగ్ అనగానే తనకి మొదట చాలా భయం వేసిందని చెప్పింది ప్రగ్యా.అయితే బాలయ్య మాత్రం షూటింగ్ లో చాలా జోవియల్ గా ఉంటారని..

షూటింగ్ గ్యాప్ లో సరదాగా జోక్స్ కూడా చెబుతారని.. బాలయ్యతో షూటింగ్ చేసే సమయంలో తను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది ఈ యువ హీరోయిన్.ఇక అఖండ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పి సినిమాలోకి ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.ఈ సినిమాని వినాయక చవితికి రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ దానిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు అభిమానులు. ఇక షూటింగ్ సమయంలో బాలయ్యకు కోపం ఎక్కువ ఉంటుందని గతంలో వచ్చిన పుకార్లన్నింటికీ తాజాగా చెక్ పెట్టింది అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: