తెలుగు సినీ పరిశ్రమలో ఎంద‌రో అందాల భామలు తమ నటనతో, గ్లామర్ తో కుర్రకారును మంత్రముగ్ధులను చేశారు . కానీ వారి లో కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితమై టాలీవుడ్‌ నుంచి వెళ్లిపోయారు . అలా వెళ్లిన వారిలో ఒకరు .. ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ క్రేజ్‌ను పొందిన హీరోయిన్ దిశా పటాని కూడా ఒక‌రు. తెలుగులో దిశా పటాని చేసిన మొదటి సినిమా ‘లోఫర్’. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయి లో ఫలితాన్ని ఇవ్వలేదు. అదే సమయం లో దిశా గ్లామర్ తో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది . తర్వాత ఆమె టాలీవుడ్‌ను పూర్తిగా వదిలేసి బాలీవుడ్‌ వైపు వెళ్లింది.


బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్నా , చాలామంది కథానాయికల మాదిరి గానే ఆమెకు స్టార్డం రావడం కొంచెం ఆలస్యమైంది . కానీ సోషల్ మీడియా లో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది . ఈ అమ్మడు షేర్ చేసే హాట్ ఫోటోల కి కోట్లు మంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు . ఇటీవల దిశా ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏ.డి’ లో కీలక పాత్రలో కనిపించింది . ఈ సినిమా వసూళ్లు రూ.1000 కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇక దిశా నటించిన మరో సినిమా ‘కంగువ’ డిజాస్టర్ అయినప్పటికీ .. ఆమె గ్లామర్‌కు మాత్రం డిమాండ్ తగ్గలేదు.



ప్రస్తుతం ఒక్కో సినిమాకు దిశా పటాని తీసుకునే రెమ్యునరేషన్ ఏకంగా రూ. 3 కోట్లు. ఆమె వద్ద ఉన్న ఆస్తులు కూడా కోట్లల్లోనే ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలే చేసినా.. బాలీవుడ్‌ కు వెళ్లిన తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది . ఇండస్ట్రీలో ప్రస్తుతం దిశా పటాని కంటే గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్లు లేరు అని సినీ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్‌లో సరైన అవకాశాలు రాకపోయినా, బాలీవుడ్‌ను తన అందంతో, స్టైల్‌తో ఓవర్‌టేక్ చేసిన దిశా.. నిజంగా ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం.




మరింత సమాచారం తెలుసుకోండి: