ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. “మామ్ సినిమా కోసం శ్రీదేవి చూపిన అంకితభావం అమోఘం. ఈ పాత్ర కోసం ఆమె ఎంత కష్టపడిందో చెప్పలేను. సినిమాకి నాలుగు భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పింది. మలయాళం డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. కానీ ఆమె పర్ఫెక్ట్గా నేర్చుకుని డబ్బింగ్ చేసింది. ఈ స్థాయి కట్టుదిట్టమైన నైపుణ్యం చాలా అరుదైన నటీమణులకు మాత్రమే ఉంటుంది” అని బోనీ చెప్పారు.అంతేకాక, సినిమాలో సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ను తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైందని బోనీ చెప్పారు. “అప్పుడు శ్రీదేవి ముందుకు వచ్చి, తన పారితోషికంలో 70 లక్షలు తగ్గించుకుంటానని చెప్పింది. ఆ మొత్తం ఏ.ఆర్. రెహమాన్కు ఇచ్చి సినిమా కోసం ఆయనను ఒప్పించాం. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మాకు ఎంతో సహాయపడింది. లేకపోతే ఈ సినిమా కోసం రెహమాన్ను తీసుకోవడం కష్టమే అయ్యేది” అని బోనీ చెప్పారు.
షూటింగ్ సమయంలో శ్రీదేవి పూర్తిగా పాత్రలో మునిగిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. “మామ్ సినిమా షూటింగ్ రోజుల్లో శ్రీదేవి నాతో మాట్లాడేది చాలా తక్కువ. ఒకే గదిలో ఉంటే డిస్టర్బ్ అవుతానని చెప్పి, ప్రత్యేకంగా ఒక గదిలో ఉండేది. సినిమాపై ఆమె ఫోకస్ అంతా. ప్రతి సీన్ను పరిపూర్ణంగా చేయడానికి ఆమె పెట్టిన శ్రమ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ కష్టానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది” అని బోనీ కన్నీటి పర్యంతమయ్యారు. 2018లో దుబాయ్లోని ఒక హోటల్లో జరిగిన అనుకోని ప్రమాదంలో శ్రీదేవి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం భారత సినీ పరిశ్రమకు ఒక పెద్ద నష్టం. బోనీ కపూర్ మాట్లాడుతూ, “శ్రీదేవి లేని లోటు సినీ పరిశ్రమలో ఎవరు తీర్చలేనిది. ఆమె స్థాయి, ఆమె అంకితభావం, ఆమె నటనకు ఎవరూ సరితూగలేరు. ఈ తరం నటీమణులకు ఆమె ఓ ప్రేరణ” అని భావోద్వేగంతో అన్నారు.
“మామ్” చిత్రం ద్వారా శ్రీదేవి తన చివరి రోజుల్లో కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఈ చిత్రం ఆమెకు జాతీయ స్థాయిలో ఘనత తెచ్చిపెట్టింది. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వం, కృషి, అంకితభావం, మరియు సృజనాత్మకతతో సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకుంది శ్రీదేవి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి