
ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని మొదట ఈ స్క్రిప్ట్ను టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలకు వినిపించినట్లు సమాచారం. మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు ఈ కథను నేరుగా చెప్పారట. కానీ ఆ సమయంలో రామ్ చరణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోయారని ఇండస్ట్రీలో టాక్. తరువాత నేచురల్ స్టార్ నానికి ఈ కథను వినిపించగా, ఆయన కూడా అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉండటంతో ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. అలాగే లేడీస్ హార్ట్త్రోబ్, నేషన్ల్ మేల్ క్రష్ విజయ్ దేవరకొండకూ ఈ స్క్రిప్ట్ వెళ్లిందట. కానీ సినిమా కాన్సెప్ట్ తన స్టార్ ఇమేజ్కు సరిపడదని భావించి విజయ్ ఈ కథను తిరస్కరించాడని తెలుస్తోంది. ఇలా వరుసగా ఇండస్ట్రీలోని టాప్ హీరోల చేత ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంటే, తేజ సజ్జ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి సైన్ చేయడం నిజంగా సినిమా మేకర్స్కి గోల్డెన్ టర్నింగ్ పాయింట్గా మారింది.
సినిమా రిలీజ్ అయిన తర్వాత తేజ సజ్జ పేరు రాత్రికిరాత్రే స్టార్ హీరోల సరసన నిలిచిపోయింది. ప్రస్తుతం తేజ ఏ ప్రాజెక్ట్ సైన్ చేసినా ఇండస్ట్రీలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. మీరాయి విజయంతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజనరీ డైరెక్టర్గా పేరుపొందారు. ఆయన కథ చెప్పే తీరు, ఎమోషనల్ పాయింట్స్ హైలైట్ చేసిన విధానం, టెక్నికల్ టీమ్ కృషి అన్నీ కలిపి ఈ సినిమాను బ్లాక్బస్టర్గా నిలబెట్టాయి. తక్కువ బడ్జెట్లో, సింపుల్ కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన విషయం. ఇప్పుడు మీరాయి టాక్ విన్న తర్వాత టాప్ హీరోలందరూ ఈ కథను వదులుకోవడం పెద్ద తప్పిదమని భావిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. తేజ ఈ సినిమాతో నిజంగానే ఇండస్ట్రీలో ఓ బలమైన హీరోగా తన స్థానం సంపాదించుకున్నాడు. మొత్తానికి మీరాయి సినిమా తేజ కెరీర్ను మాత్రమే కాకుండా, టాలీవుడ్లో యువ హీరోలకు కొత్త దారి చూపించేలా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం వల్ల తేజ, దర్శకుడు కార్తీక్, మొత్తం టీమ్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందుతున్నారు.