మెగా హీరో వరుణ్ తేజ్-పూజ హెగ్డే హీరో హీరోయిన్స్ గా అధర్వ ముఖ్య పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా వాల్మీకి. మాంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఆడియో విడుదలతో పాటు ప్రీ రిలీజ్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఇక మొదటి షో రిపోర్ట్స్ గురించి వెయిట్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. ఇదిలా ఉండగా తమిళ బ్లాక్ బస్టర్ గా నాలుగేళ్ల క్రితం వచ్చిన జిగర్ తండాను హరీష్ శంకర్ తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేసుంటాడా అనే అనుమానాలు జనంలో బాగా ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం పవర్ స్టార్ తో హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్.

ఇక కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న జిగర్ తండాను సినిమాని తమిళ సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులు ఆ టైంలోనే చూసేశారు. దబాంగ్ కే అన్ని మార్పులు చేసి గబ్బర్ సింగ్ గా హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకి ఆ మాత్రం చేయలేడా అనే మాట మేగా ఫ్యాన్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. కానీ కొన్ని మార్పులు అంత ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండవన్న వాస్తవం కూడా ఒకటుంది. అలాంటి ఓ పాయింట్ మీదే ఫిలిం నగర్ లో డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి.

అందుకు కారణం వాల్మీకి సినిమాలో సెకండ్ హీరోయిన్ మృణాళినితో అధర్వ ప్రేమలో ఉంటాడు. కానీ వాల్మీకిగా నటిస్తున్న హీరో గణేష్ పాత్ర కూడా ఈ అమ్మాయి మీదే మనసు పారేసుకుంటుంది. కట్ చేస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలవుతుంది. కానీ తమిళ్ లో ఇలా ఉండదు. చాలా కీలకంగా అనిపించే ఈ మార్పును కేవలం వరుణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు ఉందే గాని నిజంగా కథ డిమాండ్ చేయడం అయితే కాదనే మాట బాగా వినిపిస్తోంది. అసలే పూజా హెగ్డేది క్యామియో లాంటి పాత్ర. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుంది. అందుకే భారం మొత్తం మృణాళిని మీదే ఉంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథను మన ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో త్వరలోనే తెలియనుంది. ఇక ఇలాంటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ మనం ఇప్పటికే చాలానే చూశాము. ఇప్పుడు అదే వాల్మీకి కి మేయిన్ పాయింట్ అని తెలియడంతో కాస్త అందరికి అనుమానాలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: