ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం అనేది ఏ మాత్రం కనిపించడం లేదు. డబ్బు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అవుతున్నారు. తాజాగా తెలంగాణాలో కన్న తండ్రులకి తిండి పెట్టకుండా చంపిన కొడుకుల ఉదంతం మరిచిపోక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అది జరిగింది తమిళనాడులో. కన్నతల్లి అని కూడా చూడకుండా రెండు వారాలపాటు మరుగుదొడ్డిలో ఉంచి తాళం వేసిన కుమారుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా కోయంబత్తూరు పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల మేరకు తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరులోని దాల్మియా బోర్డ్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ లో వాష్ రూమ్ నుంచి కేకలు వినిపించాయి.



అయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరైన స్పందన లేకపోవడంతో జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. దీంతో జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్లి చేరుకుని వాష్ రూమ్ లో దీనావస్థలో ఉన్న వృద్ధురాలిని గుర్తించారు. ఆమెను రక్షించి బయటకు తీసుకురాగా ఆమె పేరు రాధ అని, ఆమెకు నలుగురు పిల్లలున్నారని పోలీసులు గుర్తించారు.



ఇక ఆమె భర్త మరణించడంతో తనకు రావాల్సిన పింఛను ఆమెకు అందకుండా చిన్న కుమారుడు మోసగించారని పోలీసులు గుర్తించారు. అంతే కాక ఆమె బాగోగులు చూడకుండా ఎవరికీ కనపడకుండా వాష్ రూమ్ లో ఉంచి తాళం వేసినట్లు పోలీసులు తేల్చారు. ఇక ప్రస్తుతానికి ఆమె కొడుకులను సంప్రదించే పనిలో పడ్డారు పోలీసులు. ఆమెను ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థలో చేర్చారు. చాలా రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో ఆమెకు ఆహారం అందించిన తర్వాత చికిత్స చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: