ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కాస్త కంట్రోల్ లోనే ఉంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగింది. ఇక ప్రస్తుతం దాదాపుగా కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ లు తీసుకున్నవారు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు కరోనా వైరస్ అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ముప్పు పొంచివుందని ప్రాణాలు పోతాయని శాస్త్రవేత్తలు ఎంతలా హెచ్చరిస్తునప్పటికీ అందరూ ఇప్పుడు కరోనా వైరస్ ను లైట్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అక్కడక్కడ మళ్లీ వైరస్ కేసులు పెరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఇక మరికొంత మంది ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో ఒకవేళ వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ అది సాధారణ జ్వరమే అంటూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్లక్ష్యంగా వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తీవ్ర కరోనా లక్షణాలతో పదిమంది చేరి ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయి చివరికి ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడింది అంటూ వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గడంతో వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ సాధారణ జ్వరం అని జనాలు భావిస్తున్నారు అంటూ వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించాయి ఉంటే చాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి అని సూచించారు.