ఐదేళ్ల కాలం పరిపాలన చేసిన చంద్రబాబు... రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా అభివృద్ది చేయలేదని మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. కేవలం గ్రాఫిక్స్ భవనాలతో ఐదేళ్ల పాటు ప్రజలను భ్రమతో మాయ చేశారని ఆరోపించారు నాని. ఐదేళ్ పాటు భ్రమలోనే చంద్రబాబు కాలం గడిపారన్నారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చంద్రబాబు మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు. జగన్ వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి పూర్తి చేసి ప్రారంభించారన్నారు. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఏ రోజు కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్ని నాని వెల్లడించారు. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు 2016లోనే రిపోర్టు తయారు చేశారన్న మంత్రి పేర్ని నాని... చంద్రబాబు ప్రభుత్వం కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు.
ఐదేళ్ల కాలం పరిపాలన చేసిన చంద్రబాబు... రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా అభివృద్ది చేయలేదని మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. కేవలం గ్రాఫిక్స్ భవనాలతో ఐదేళ్ల పాటు ప్రజలను భ్రమతో మాయ చేశారని ఆరోపించారు నాని. ఐదేళ్ పాటు భ్రమలోనే చంద్రబాబు కాలం గడిపారన్నారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చంద్రబాబు మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు. జగన్ వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి పూర్తి చేసి ప్రారంభించారన్నారు. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఏ రోజు కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్ని నాని వెల్లడించారు. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు 2016లోనే రిపోర్టు తయారు చేశారన్న మంత్రి పేర్ని నాని... చంద్రబాబు ప్రభుత్వం కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు.