వాస్తవానికి బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో రెండేళ్ల పాటు ఇంకా వివో సంస్థ ఐపీఎల్ టోర్నీకి స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది. అయితే 2020 ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం తలెత్తడంతో... చైనా సంస్థ అయితే వివోను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2020 ఏడాది ఐపీఎల్ టోర్నీకి వివోను టైటిల్ స్పాన్సర్గా తొలిగించిన బీసీసీఐ... డ్రీమ్ 11 సంస్థకు అవకాశం కల్పించింది. గతేడాది కూడా అలాగే చేసిన బీసీసీఐ. 2018 నుంచి 2022 ఏడాది వరకు ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్గా బీసీసీఐతో వివో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 440 కోట్ల రూపాయలను ప్రతి ఏటా బీసీసీఐకు చెల్లించేందుకు కూడా అగ్రిమెంట్ చేసుకుంది వివో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సంస్థ వివోనే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండేళ్ల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ సంస్థ వ్యవహరిస్తున్న ప్రకటించిన బ్రిజేష్ పటేల్.. ఆ ఒప్పందం విలువ మాత్రం ప్రకటించలేదు.
వాస్తవానికి బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో రెండేళ్ల పాటు ఇంకా వివో సంస్థ ఐపీఎల్ టోర్నీకి స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది. అయితే 2020 ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం తలెత్తడంతో... చైనా సంస్థ అయితే వివోను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2020 ఏడాది ఐపీఎల్ టోర్నీకి వివోను టైటిల్ స్పాన్సర్గా తొలిగించిన బీసీసీఐ... డ్రీమ్ 11 సంస్థకు అవకాశం కల్పించింది. గతేడాది కూడా అలాగే చేసిన బీసీసీఐ. 2018 నుంచి 2022 ఏడాది వరకు ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్గా బీసీసీఐతో వివో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 440 కోట్ల రూపాయలను ప్రతి ఏటా బీసీసీఐకు చెల్లించేందుకు కూడా అగ్రిమెంట్ చేసుకుంది వివో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సంస్థ వివోనే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండేళ్ల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ సంస్థ వ్యవహరిస్తున్న ప్రకటించిన బ్రిజేష్ పటేల్.. ఆ ఒప్పందం విలువ మాత్రం ప్రకటించలేదు.