ఏపీ సచివాలయం : సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సంప్రదింపుల కమిటీ సభ్యులు ఇవాళ ఏపీ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ...  ఏపీ ఉద్యోగులపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం లో భాగంగా ఈ కమిటీ అని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం  ఇచ్చామన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి. జిఓలు అభయన్స్ లో పెట్టాలన్నారు.. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని గుర్తు చేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం  వస్తామని... మరో సారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి. 

జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  ఉద్యోగస్తులు కూడా  మా ప్రభుత్వంలో భాగమేనని ప్రకటనచేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  ఏ సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం.. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసిందో ప్రజలకు వివరించటం తప్పెలా అవుతుందన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి. సమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు నిజమైన సమస్యలుంటే  పరిస్కారనికి కృషి చేస్తుందని తెలిపారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్ కు అర్థం ఉండదని చెప్పారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  అలానే చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణ లో పెట్టె ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు సజ్జల రామకృష్ణ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: