కానీ ఇటీవలి కాలంలో మాత్రం హాయిగా నిద్రపోయినా కూడా డబ్బులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎన్నో పరుపులు కంపెనీలు తమ కంపెనీ లో తయారైన పరుపులను చెక్ చేసేందుకు ఎంతోమంది నిద్రపోతే జీతం ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి అని చెప్పాలి. ఇటీవలే పరుపుల కంపెనీ పోటీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఓ యువతి హాయిగా నిద్ర పోయి 5 లక్షల రూపాయలు గెలుచుకుంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోల్కతాకు చెందిన త్రివర్ణ అనే యువతి పరుపుల కంపెనీ నిర్వహించిన నిద్ర పోటీల్లో విజేతగా నిలిచింది.
ఆమె పేరు త్రివర్ణ.. ఆమెకు చిన్నప్పటి నుంచే బాగా నిద్ర పోవడం అలవాటు. ఎక్కడపడితే అక్కడ గాఢనిద్రలోకి జారుకునేది. నిద్ర మొహం దానివి అంటూ కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆమెకు ఉన్న నిద్రమబ్బు ఇక ఇప్పుడు 5లక్షల రూపాయలు గెలుచుకునేల ఉపయోగ పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో వరుసగా వందరోజుల పాటు 9 గంటలకు నిద్ర పోవాలి. ఈ పోటీలలో 5.5 లక్షల మంది పాల్గొన్నారు. త్రివర్ణ కు వందకు తొంభై ఐదు మార్కులు వచ్చాయి. దీంతో అందరి కంటే ముందు నిలిచిన త్రివర్ణ కు 500000 బహుమతిగా ఇచ్చారు పరుపుల కంపెనీ వారు.