ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది.  గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికీ కూడా ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు రోజురోజుకు ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఇప్పటికే కోట్ల సంఖ్యలో ప్రజలు మరణించారు అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికికూడా ఈ మహమ్మారి వైరస్ మరణమృదంగం కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది అయితే అటు అధికారులు ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.



 ఇకపోతే ఈ వైరస్ లో రోజురోజుకూ సరికొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయ్. వైరస్ లో వెలుగులోకి వస్తున్నా కొత్త లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయ్. ఇప్పుడు వైరస్ లోని మరో కొత్త లక్షణం అందరిని మరింత ఆందోళన చెందేలా చేస్తుంది   కరోనా వైరస్ బారిన పడటం ఆస్పత్రికి వెళ్లి పరిస్థితి విషమించి ఎంతోమంది చనిపోతున్నారు. ఇప్పుడు అంతా హ్యాపీగానే సాగిపోతున్నప్పటికీ ఉన్నట్లుండి  మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. దీనికి కారణం హ్యాపీ హైపోక్సియా  అనే కొత్త లక్షణం.  ఈ లక్షణం ద్వారా ఉన్నటువంటి ఎంతో యాక్టివ్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడం లాంటివి జరుగుతుంది.



 అయితే ఈ లక్షణం ఎక్కువగా యువతలో కనిపిస్తున్నట్లు అటు వైద్యులు గుర్తించారు  రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువ కావడం వల్ల ఇలా అకస్మాత్తు మరణాలు సంభవిస్తున్నాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. ఊపిరితిత్తులు దెబ్బతినడం రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కారణంగా ఊపిరి తీసుకునే శక్తి క్రమ క్రమంగా తగ్గిపోతుందని అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయింది అనే విషయం అటు రోగికి కూడా తెలియదు అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆయాసం దగ్గు లాంటి సమస్యలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఇక రోగికి తాము రోగులము అన్న విషయం కూడా తెలియకపోవచ్చు అని చెబుతున్నారు. పెదవులు నీలిరంగులో కి మారిపోవడం టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఆయాసంగా అనిపించడం.. చల్లటి వాతావరణంలో కూడా చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఎంతో బెటర్ అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: