సర్వమానవాళికి రాడికలిజమే పెను సవాలని భారత ప్రధాన మం్రతి నరేద్ర మోడి వ్యాఖ్యానించారు. దీని కారణంగానే ప్రతి చోట శాంతి భధ్రతలసమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన ఎస్.సి.ఓ (షాంఘై కార్పో రేషన్ ఆర్కనైజేషన్ ) సదస్సులో ప్రసంగించారు.
వర్చవల్ గా జరిగిన ఈ సదస్సులో ప్రధాన మంత్రి కీలక అంశాలపై మాట్లాడారు. తన ప్రసంగంలో ప్రధాని ఆరు నిమషాల పాటు కీలకంగా ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావించారు.
దక్షిణ ఆసియా దేశాలతో సంబంధ బాంధవ్యాలను మరింత పెంపొందించుకునేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. వ్యాపార లావాదేవీలు ఇంకా ఇంకా పెరగాల్సిన అవసంరం ఉందని నరేంద్ర మోడి అభిప్రాయ పడ్డారు. భారత్ లో విస్తారమైన వ్యాపార అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.