ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన గుత్తా సుమన్ చౌదరి.... రియల్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక రాజకీయ నాయకుల అండతో పేకాట, క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు కూడా. విజయవాడలో ఇప్పటికే మూత పడిన అన్నపూర్ణ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ నిర్వహించిన ఏపీ 24X7 న్యూస్ ఛానల్లో డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అదే సమయంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలతో పాటు వ్యాపార ప్రముఖులను ఆహ్వానించారు. ఇక వీటితో పాటు గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఏటా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. వీటికి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావులను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు కూడా. అలాగే మంత్రి కొడాలి నానికి అత్యంత ఆప్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. న్యూస్ ఛానల్ ముసుగులో కూడా అక్రమ దందాలకు గుత్తా సుమన్ పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన గుత్తా సుమన్ చౌదరి.... రియల్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక రాజకీయ నాయకుల అండతో పేకాట, క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు కూడా. విజయవాడలో ఇప్పటికే మూత పడిన అన్నపూర్ణ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ నిర్వహించిన ఏపీ 24X7 న్యూస్ ఛానల్లో డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అదే సమయంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలతో పాటు వ్యాపార ప్రముఖులను ఆహ్వానించారు. ఇక వీటితో పాటు గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఏటా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. వీటికి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావులను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు కూడా. అలాగే మంత్రి కొడాలి నానికి అత్యంత ఆప్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. న్యూస్ ఛానల్ ముసుగులో కూడా అక్రమ దందాలకు గుత్తా సుమన్ పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.