భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. అయితే ఫిదా సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోలు సరసన హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. న్యాచురల్ నటనతో పక్కింటి పిల్ల అనిపించుకునెంతల మెప్పిస్తుంది. ఢీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ స్కిన్ షో చేయకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యతన ఇస్తూ వరుస సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటుంది. 

అంతేకాదు ఇప్పుడున్న ఇతర హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి చాలా భిన్నంగా ఉంటుంది భిన్నంగా ఆలోచిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తనకు కథ నచ్చి కంటెంట్ ఉందనిపిస్తేనే ఎటువంటి సినిమాల్లో ఆయన ఆమె నటిస్తోంది. కోట్లు ఇస్తామన్నా కూడా స్టార్ హీరోల సినిమాలను కూడా నచ్చకపోతే ముఖం మీద చెయ్యను అని చెప్పేస్తుంది. అయితే సినిమాలే కాదు తనకు ఇష్టం లేదని తాజాగా రెండు కోట్లు ఇస్తామన్న ఒక యాడ్ కూడా రిజెక్ట్ చేసింది  సాయి పల్లవి. అయితే 2019లో ఒక్క బ్లీచింగ్ క్రీమ్ కంపెనీ ఫైర్నెస్ క్రీమ్ యాడ్ కోసం సాయి పల్లవిని కలిసారట .

అందుకు  తనకి రెండు కోట్ల రమ్యునరేషన్ ఇస్తామని కూడా అన్నారట కానీ సాయి పల్లవి మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు. అసలు ఈ ఆఫర్ సాయి పల్లవి రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది.సాయి పల్లవి మాట్లాడుతున్న చిన్నతనంలో ఉన్నప్పుడు నల్లగా ఉండే అబ్బాయిలతో నేను కనిపిస్తే.. నువ్వు చాలా తెల్లగా ఉన్నావు.. అందంగా ఉన్నావు.. అంటూ నన్ను పొగిడే వారిని.. అలాగే నల్లగా ఉన్న అమ్మాయిలతో తెల్లగా ఉండే అబ్బాయిని చూస్తే మాత్రం ఆ అమ్మాయి అబ్బాయిని ఏం మాయ చేసి ఉంటుందో అంటూ వెటకారంగా మాట్లాడే వారిని వివరించింది. స్కిన్ కలర్ కు ప్రాధాన్యత ఉండకూడదనే ఉద్దేశంతోనే కోట్ల ఆఫర్ వచ్చిన ఆ యాడ్ ను రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: