ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ప్రియమణి. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో తనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత నాగార్జున జగపతిబాబు రవితేజ జూనియర్ ఎన్టీఆర్ గోపీచంద్ వంటి అందరి హీరోలతో నటించి మంచి హిట్ అందుకుంది. తాజాగా ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం తగ్గేదేలే అంటుంది. వరుస సినిమాలు చేస్తూ దేశంలోనే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. వచ్చే రెండేళ్ల పాటు తన డేట్స్ ఒకటి కూడా కాళీ లేవు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

అంతలా ఈమె బిజీగా అయిందని అంటున్నారు. సినిమాలే కాకుండా ఓటిటి లో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా భామకలాపంతో సినిమాతో నేరుగా ఓటీటీ లోకి వచ్చింది. తాజాగా మోస్ట్ అవైటెడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో షో ది ఫ్యామిలీ మెన్ త్రీ షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లుగా సమాచారం వినబడుతుంది. అజయ్ దేవగన్ నటించిన మైదాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తమిళంలో సైతం కొటేషన్ గ్యాంగ్ సినిమాలో చేస్తోంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. మరొకవైపు కన్నడలో సైతం వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ హిందీ కన్నడ వంటి భాషల్లో కూడా తీరిక లేకుండ బిజీగా ఉంది ఈ బ్యూటీ. మరోవైపు కన్నడలో Khaimara చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న ప్రియమణి ది ఫ్యామిలీ మ్యాన్ 3తో ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు. మొత్తానికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నో రెస్ట్‌ అంటూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: