ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోగా ఆయా సెలబ్రిటీల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించని జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ ధరించి ఓటు హక్కును వినియోగించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
 
ఈరోజు హైదరాబాద్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో భార్య ప్రణతి, తల్లి షాలినితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకోవడంతో ఆయన వైసీపీకి తన మద్దతు అని చెప్పకనే చెప్పేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ స్నేహితులు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు.
 
నాని, వంశీ వైసీపీ తరపున పోటీ చేస్తుండగా ఎన్టీఆర్ డైరెక్ట్ గా మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎలాంటి వీడియో రిలీజ్ చేయలేదు. 2029 సమయానికి తారక్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో తారక్ టీడీపీ పగ్గాలు తీసుకుని పార్టీ రూపురేఖలను మార్చేస్తారని సీఎం అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
 
అయితే పాలిటిక్స్ విషయంలో తారక్ మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం తారక్ నోరు మెదిపే వరకు ఆగాల్సిందేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందని పలువురు జ్యోతిష్కులు వేర్వేరు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి తారక్ నిజంగానే సీఎం అవుతారో లేదో తెలియాలంటే మాత్రం మరో 10, 15 సంవత్సరాలు ఆగాల్సిందే. ప్రస్తుతం సినీ కెరీర్ కే ప్రాధాన్యత ఇస్తున్న తారక్ భవిష్యత్తులో పూర్తిస్థాయిలో రాజకీయాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: