ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పాదయాత్ర నిర్వహించిన సంగతి అందిరికి తెలిసిందే. అయితే ఆయన పాదయాత్ర సమయంలో వచ్చిన అర్జీలను పరిశీలించి, ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపొందించారు. దానిని ప్రజల్లోకి తీసుకవెళ్ళి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మెనిఫేస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించుకుంటున్నారు.

ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ  రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు... ఆచరణలో కూడ తాము ముందుంటామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో  ఏపీ సీఎం జగన్ మాట్లాడారు.  ఆత్మహత్యలు చేసుకొన్న  రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.  గత ఐదేళ్లలో సుమారు 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే.. కేవలం 391 మంది రైతులకు మాత్రమే  పరిహరం చెల్లించినట్టుగా జిల్లాల నుండి  సమాచారం  అందింది.

అయితే ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలకు పరిహరం చెల్లించాలని సీఎం జగన్  ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలను పరిహారంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్లు నేరుగా  పరిహారం  చెల్లించాలని జగన్ సూచించారు.

గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందించేవారు. అది కూడా విడతల వారీగా వచ్చేది. వచ్చే పరిహారంతో తమ పిల్లల బతుకులు బాగుపడతాయని అనుకుంటే అవి కొచ్చెం కొచ్చెం విడుదల అయ్యేవి. దానిలో కూడా అక్కడి అధికారుల చేతివాటం ఉపయోగించేవారు. ఇప్పుడు పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమకు నేరుగా నగదు అందెేవిధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వెడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: