కరోనా కారణంగా దేశాలు లాక్ డౌన్ ను కట్టుదిట్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలే కాకుండా మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. అడవిలో బ్రతికే జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ..జనావాసాలలో సంచరించే జీవులకు మాత్రం ఆహరం కోసం నానాతిప్పలు పడుతున్నాయి. కొంతమంది జంతు ప్రేమికులు వాటి కష్టాలను చూడలేక వాటికి తోచిన సాయం చేస్తున్నారు.

 

యూపీ లో మూగజీవాలు ఆహారం పెట్టేవారు లేక ఆకలితో అలమటిస్తున్నాయి .అయితే యూపీ లోని పోలీస్ బ్రదర్స్ తమ దయాగుణాన్ని చాటుకున్నారు . పరిసర ప్రాంతాల్లోని కోతుల సమూహాలకు ఆహారాన్ని పెట్టి వాటి ఆకలిని తీర్చారు . దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .కొంతమంది నెటిజన్స్ యూపీపోలీస్ లు చేసిన సహాయానికి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: