అమెరికాలో దారుణం జరిగింది.. అంటే కరోనా మరణాలు కాదు.. కరోనాతో కల్లోలభరితంగా ఉన్న భారతీయ దంపతులు విగతజీవుల్లా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అలా అని వీరికి కరోనా వచ్చి మరణించలేదు. జెర్సీ సిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది.  ఏప్రిల్ 26న గరిమా కొఠారీ అనే యువతి తన ఫ్లాట్ లో విగతజీవిగా పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు.  ఆమె భర్త మన్మోహన్ మల్ జెర్సీ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో శవమై కనిపించాడు. అయితే కొఠారీ శరీరంపై గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావు ఇచ్చింది.

 

ఈ విషయం పోస్ట్ మార్టంలో వైద్యులు తెలిపారు.. అంతే కాదు, ఆమె ఐదు నెలల గర్భవతి అని కూడా వైద్య నిపుణులు తెలిపారు. ఓ వ్యక్తి హడ్సన్ నదిలో ఆత్మహత్యకు యత్నించాడన్న సమాచారంతో పోలీసులు గాలింపు జరపగా, మన్మోహన్ మల్ మృతదేహం లభించింది.  అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం.... భార్యను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

మన్మోహన్ భారత్ లో ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన నిపుణుడు. వీరికి జెర్సీ సిటీలో 'నుక్కడ్' అనే భారతీయ రెస్టారెంట్ కూడా ఉంది. కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయడంలేదు. అయితే  భార్యను చంపి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది మిస్టరీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: