టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న విషయం తెలిసిందే.  ఓ వైపు వెండితెరపై వెలిగిపోతూ.. రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.  తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఈ రోజు ఫోన్లో ముచ్చటించడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. ప్రస్తుతం బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాన్  తరచుగా ఫోన్లో సంభాషించే దత్తాత్రేయ ప్రజా సంబంధమైన అనేక విషయాలు మాట్లాడుతుంటారని, ఆయన మాటలు, ప్రజా జీవిత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పవన్ వివరించారు.

 

తాజాగా ‘హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంతో మృదుస్వభావి. ఆయనతో నేడు జరిగిన టెలిఫోన్ సంభాషణ ఆసాంతం ఆప్యాయంగా సాగింది. విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజి దుర్ఘటనలో పలువురు మృతి చెందడం, పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలవడం కలచివేసిందన్నారు. అంతేగాకుండా, కరోనా ప్రభావం, లాక్ డౌన్ పరిస్థితులపైనా మేం చర్చించుకున్నాం" అని పవన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: