టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను మళ్ళీ తిరిగి క్రికెట్ ఆడితే మాత్రం అనేక రికార్డ్ లను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ధోనీ ప్రస్తుతం వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల లిస్ట్‌లో 10,733 పరుగులతో5 వ ప్లేస్ లో ఉండగా మరో 116 పరుగులు చేస్తే ద్రావిడ్ ని దాటేస్తాడు. ద్రావిడ్ 10,899 పరుగులు చేసాడు. 

 

మరో రెండు టీ-20 ఆడితే 100 టీ-20లు ఆడిన రెండో ఆటగాడు అవుతాడు. ఇది ఇప్పటి వరకు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఐపిఎల్ ఆడితే 200 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: