ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్ ను పరీక్షించగా 246 మందికి కరోనా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో 47 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకుని డిశ్చార్జి కాగా ఇద్దరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందగా అనంతపురం జిల్లాలో ఒకరు మృతి చెందారు. 
 
గత 24 గంటల్లో నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5087కు చేరగా మృతుల సంఖ్య 86కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2231 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన 58 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: