ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 264 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో కృష్ణా, కర్నూలు జిల్లాలలో అధిక సంఖ్య కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ ధరించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. 
 
జిల్లాలో పోలీసులు నేటి నుంచి మాస్క్ ధరించని వారికి 100 రూపాయల జరిమానా విధించనున్నారు. ఒకే వ్యక్తి రెండోసారి, మూడోసారి మాస్క్ ధరించకుండా కనిపిస్తే మాత్రం వేలల్లో జరిమానా విధించాలని... కృష్ణా జిల్లా అంతటా ఈ నిబంధన అమల్లో ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: