ఇటీవలే ఎంతో ప్రముఖ ఆలయమైన తిరుమలలో సిబ్బంది కరోనా  వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో తాజాగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా కేసులు నిర్వహించాలని ట్రూనాల్  కిట్లు  కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

 తిరుమలలో డ్యూటీలో చేస్తూ బ్యారక్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి  పాజిటివ్ అని నిర్ధారణ అయిందని., ఉద్యోగులందరికీ ప్రత్యేక గదులు కేటాయించాలని పేర్కొన్నారు, అయితే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: