దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం తో బి‌జే‌పి  గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది.ఎప్పుడు లేని విధంగా ఈ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.బి‌జే‌పి ఆగ్ర నాయకులందరు కూడా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయడంతో దేశం మొత్తం దృష్టి ఈ ఎన్నికలపై పడింది.

అయితే నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో చివరి రోజుగా బి‌జే‌పి, కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా తో ప్రచారం చేయించింది.ఆదివారం ఆయన సికింద్రాబాద్ రోడ్ షో లో పాల్గొని అనంతరం రాష్ట్ర బి‌జే‌పి కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.బి‌జే‌పి అభ్యర్థి ఈ ఎన్నికల్లో మేయర్ సీటు ను అధిరోహించడం ఖాయంగా కనిపిస్తుందన్నారు.

అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ ‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు.ప్రజలు బి‌జే‌పి వైపు ఉన్నారని ఆయన తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: