క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సినీ న‌టుడు మెగాస్టార్ త‌న‌వంతు సాయం చేశారు.ప్ర‌తి జిల్లాలో ఆక్సిజ‌న్ బ్యాంక్ ఏర్పాటు చేసి క‌రోనా రోగుల ప్రాణాల‌ను కాపాడ‌గ‌లిగారు.గ‌తంలో ర‌క్త‌దానం, నేత్ర‌దానంపై విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించి ఎంతో మందికి ప్రాణ‌పోసేలా స‌మాజంలో చిరంజీవి మార్పుని తీసుకువ‌చ్చారు.అయితే చిరంజీవి చేస్తున్న సాయంపై ర‌చ‌యిత‌,గాయ‌కుడు చ‌ర‌ణ్ అర్జున్ పాట రాశారు. జై చిరంజీవా జైజై చిరంజీవా సేవ‌కు ఎప్పుడో చూపావు నువ్వుతోవ అంటూ స్వ‌యంగా చ‌ర‌ణ్ అర్జున్ పాట రాసి పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. చ‌ర‌ణ్ అర్జున్ పాడిన పాట‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ట్వీట్ చేశారు. ప్ర‌తి అభిమాని గుండె చ‌ప్పుడు ఈ పాట అని...మెగా సాయం స్ఫూర్తి గానమంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: