ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రంలో నిర్వ‌హించబోయే ఇంట‌ర్ మ‌రియు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ పై...ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తేదీల‌పై నిర్న‌యం తీసుకోనున్నారు. అయితే క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప‌దోత‌రగ‌తి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం పై విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు సైతం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను వ్య‌తిరేఖిస్తున్నాయి. కానీ ప్ర‌భుత్వం క‌చ్చితంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే విద్యార్థుల‌కు ఎలంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌తోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. దాంతో పరీక్ష‌లు ఎప్పుడు ఉంటాయా అని విద్యార్థులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: