టోక్యో ఒలంపిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా మొదటి గోల్డ్ మెడల్ ను డ్రాగన్ కంట్రీ  దక్కించుకుంది. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనా క్రీడాకారిణి యాంగ్ క్యాన్ గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక రష్యాకు చెందిన షూటర్ గలషినా కు వెండి, స్విట్జర్ లాండ్ ప్లేయర్ క్రిస్టిన్ కు కాంస్య పతాకాలు వచ్చాయి. మరోవైపు క్వాలిఫై రౌండ్  లో మన భారత షూటర్లు నిరాశ పరిచారు. దాంతో ఫైనల్లో భారత్ చోటు దక్కించుకోలేకపోయింది.

ఇది ఇలా ఉండగా ప్రతి నాలుగేళ్లకు జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ఈ ఏడాది ఒక సంవత్సరం ఆలస్యం గా ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒలంపిక్ క్రీడలు ఆలస్యమయ్యాయి.  ఇక ఈ ఏడాది భారత క్రీడాకారులు 18 భాగాల్లో... మొత్తం 120 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. దాంతో భారత్ కు ఈసారి పథకాలు రావాలని అంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా టోక్యో ఒలంపిక్స్ లో గెలిచిన క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: