మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు హుజూర్ నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తాజాగా కాశీ నుండి వచ్చిన సాధువుతో హుజుర్నగర్ లో పూజలు చేయించిన శానంపూడి సైదిరెడ్డి నియమాలను ఉల్లఘించారనే సమాచారం అందుతుంది. మేళ్ళచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కాశి నుంచి వచ్చిన సాధువుకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు మరియు టిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గర్భ గుడిలో సాధువు చేత శివలింగానికి అభిషేకం కూడా చేయించారు. ఈ సమయంలో ఆ సాధువు వెంట నియమాలకు అతీతంగా ఒక మహిళా కూడా ఉండటం విశేషం. ఇక శానంపూడి సైదిరెడ్డి గతంలో కూడా ఓ స్వామిజీ ఇచ్చిన తావిదు వల్లనే ఎమ్మెల్యే అయ్యాడంటూ నార్కెట్ పల్లికి చెందిన ఓ స్వామిజీ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: