ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎమర్జెన్సీ సర్వీసులు పని చేయవని సమాచారం. జూలై 31న శనివారం మిడ్ నైట్ 1 గంట నుంచి నాలుగు గంటల వరకు అంబులెన్సులు పని చేయవని తెలుస్తోంది. టెక్నికల్ ఇష్యూ వచ్చిన కారణంగా 108 ఎమర్జెన్సీ నెంబర్ పని చేయబోదని అంటున్నారు. 108 బదులుగా రెండు ఆల్టర్నేట్ నెంబర్ లు ఇచ్చారు. అత్యవసర సహాయం కావలసిన వాళ్ళు 08645660208, 8331033405 నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా తప్పకుండా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. 108కు సంబంధించి ఇలాంటి సమస్య రావడం ఇదే మొదటిసారి. అంబులెన్స్ సేవలు ప్రవేశ పెట్టాక పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా ప్రజలు ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఈ స్వల్ప అంతరాయం ప్రజలపై పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: