
స్మూతికి కావాల్సిన పదార్థాలు..
దీనికోసం ఐదారు బాదంలు,ఒక అరటిపండు, నాలుగైదు జీడిపప్పు, రెండు లేదా మూడు ఖర్జూరాలు, ఐదారు ఎండు ద్రాక్ష తీసుకోవాలి.
స్మూతీ తయారు చేసే విధానం..
స్మూతి తయారు చేసుకోవడానికి ముందు బాదాములు, జీడిపప్పు,ఖర్జూరాలు,ఎండు ద్రాక్షలు బాగా కడిగి,ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే, బాదం పొట్టు తీసి,మిగతావన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి.మరియు అరటి పండును ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి,అందులో సపరేట్ ప్లేట్లో పెట్టి ఉడికించుకోవాలి.బాగా మెత్తగా ఉడికిన తర్వాత తీసి గ్రైండ్ చేసుకోవాలి.బాదం మిక్స్ లో ఈ మిశ్రమాన్ని కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వాలి.ఇలా తరచూ ఇవ్వడం వల్ల,వారికి మెదడు పెరుగుదలకు కావాల్సిన జింక్ బాగా అంది,జ్ఞాపక శక్తి పెరగుతుంది.