మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవలే
సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే మొదటి సినిమాతో వచ్చిన
సక్సెస్ ని నెక్స్ట్ సినిమాలతో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలని
వైష్ణవ్ తేజ్ బాగా తపన పడుతున్నారు. ఆయన తన
అన్నయ్య సాయి ధరమ్ తేజ్ చేసిన తప్పులు చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఉప్పెన
బ్లాక్ బస్టర్ తర్వాత
వైష్ణవ్ తేజ్ ఏ
సినిమా కి కూడా సైన్ చేయలేదు. తనతో
సినిమా చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు కానీ వైష్ణవ్ మాత్రం
సినిమాఒప్పుకోవాలా వద్దా అనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు.
అయితే తాజాగా ఒక ప్రొడక్షన్
హౌస్ కోసం
సినిమా చేసేందుకు వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రం ఒక
స్పోర్ట్స్ డ్రామా అని.. ఈ సినిమాలో అతనొక
హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే కమర్షియల్
సినిమా చేయకుండా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతోనే వైష్ణవ్ తేజ్
స్పోర్ట్స్ డ్రామా చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది. మెగా కుటుంబంలో
వరుణ్ తేజ్ విభిన్నమైన కథలతో.. వైవిధ్యమైన నటనను చూపిస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. వైష్ణవ్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు అని తెలుస్తోంది.
అయితే
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో.. సరికొత్త
డైరెక్టర్ పృథ్వి దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ డ్రామా రూపొందనుంది. అన్నపూర్ణా స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి కాబట్టి
సినిమా హై బడ్జెట్లోనే తీసే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత నటీనటులు, క్రూ సిబ్బందికి సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే
క్రిష్ తో చేస్తున్న
సినిమా ని కూడా త్వరగా పూర్తి చేయాలని వైష్ణవ్ భావిస్తున్నారు. అయితే
వైష్ణవ్ తేజ్ తొందరపడకుండా మంచి సినిమాలు ఎన్నుకోవడానికి చేస్తున్న ఆలోచన విధానం ఇతర మెగా హీరోలను
ఫిదా చేస్తోందట.
ఈ రోజుల్లో రోటీన్ సినిమాలకు ప్రేక్షకాదరణ పూర్తిగా తగ్గిపోయింది. కావున ఏదో ఒక కొత్త కంటెంట్ తో వస్తేనే
సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే
వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమాలను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు.