ఒకప్పుడు యూత్ హీరో గా దూసుకొచ్చి వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ కి ఈ మధ్యకాలం అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఎంత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నా విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు ఈ హీరో. అందుకే తనకు సూట్ అయ్యే కథని తానే రెడీ చేసుకున్నాడట. నా గురించి నా కంటే ఎవరికీ బాగా తెలియదు. అందుకే నాకు సరిపోయే కథను నేనే రాసుకుని అభిమానుల్ని థ్రిల్ చేయాలనుకుంటున్నారట రాజు తరుణ్. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ స్టోరీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథను అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా తెరకెక్కించే దర్శకుడి కోసం ట్రై చేస్తున్నాడట రాజ్ తరుణ్. అందులోనూ తనను నమ్మి తన సొంత ఆలోచనలతో లిఖించుకున్న స్టోరీ ని తెరకెక్కించే దర్శకుడు దొరకాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
 తనకు నచ్చిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లకు కథను వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. మరి ఏ  దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఇక ఈ వార్త ఎంత వరకు నిజమన్నది ఇంకా తెలియలేదు. మరి డైరెక్టర్ దొరికాక ఏమైనా అధికారికంగా ప్రకటిస్తాడేమో చూడాల్సిన అవసరం ఉంది.  ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని శరవేగంగా సక్సెస్ రుచి చూసిన ఈ యంగ్ హీరో, ఆ తర్వాత సరైన కంటెంట్ ఎంచుకోక అంతే వేగంతో వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఈ మధ్య కాలంలో "ఒరేయ్ బుజ్జిగా" చిత్రం కాస్త ఊరట కలిగించినా మళ్లీ పవర్ ప్లే మూవీ తో పట్టు కోల్పోయాడు.

 ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరోసారి డిసప్పాయింట్ అయ్యాడు రాజ్ తరుణ్. అయితే తాజాగా ఈ కుర్ర హీరో చేస్తున్న చిత్రం "స్టాండ్ అప్ రాహుల్". ఇటీవలే అక్కినేని సమంత సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. మోహన్ వీరంకి అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో  మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: